Sunday, February 18, 2007

మా తెలుగు తల్లికి మల్లె పూదండ..రూపాంతరము




రియాద్ తెలుగు కళాక్షేత్రం వార్షికోత్సవాలు (18 మే, 2006) నందు ఈ పాటకు రూపాంతరము చేయడాని ఒక చిన్న ప్రయత్నము చేసాము.

మీరందరూ తప్పక చూసి, విని, ఆనందించ గలరని ఆశిస్తూ....

--గౌరి శంకర్

మా తెలుగు తల్లికి మల్లె పూదండ download pps
మా తెలుగు తల్లికి మల్లె పూదండ flash show

Saturday, February 17, 2007

పుణ్య శివ క్షేత్రము 'అలంపూర్'


స్కంద మరియు ఇతర మహా పురణాలలో "అలంపూర్" ను "దక్షిణ కాశి" గా వర్ణించి ఉండడము విశేషము. కాశీ కి అలంపూర్ కు చాలా దగ్గరి పోలికలు ఉన్నందువలనే ఈ పేరు. కాశి లో గంగానది, విశ్వేశ్వరుడు - విశాలాక్షీ, 64 ఘట్టములున్నవి. సమీపమున త్రివేణి సంగమమున్నది. అలంపురము ఉత్తర వాహిని తుంగభద్రాతీరమున్నది. బ్రహ్మేశ్వరుడు - జోగులాంబా, పాపనాశిని, మణికర్నిక మొదలగు 64 ఘట్టములున్నవి. సమీపమున కృష్ణా తుంగభద్రా సంగమమున్నది.

బ్రహ్మ దేవుడు ప్రతిష్టించినందున బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చినది. ఇందలి బ్రహ్మేశ్వర లింగమును జ్యోతిర్లింగము అనెదరు."రససిద్ధుడు" ఈ ఆలయమును కట్టించెను.

ఇందలి నవ బ్రహ్మాలయములో ఉన్నవి అన్నీ శివలింగములే - బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, ఆర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ. ఈ ఆలయమును "శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి" అందురు. అస్టాదశ శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠము ఇది. జమదగ్ని ఆశ్రమము ఇక్కడే ఉండెనని ప్రసిద్ది. ఇంతటి చరిత్ర కల్గిన పుణ్య శివ క్షేత్రము "అలంపూర్".
మౌర్య, బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణీ చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్షాహీ, ఆసఫ్జాహీ పాలనలను అలంపూర్ చూసింది.
మరికొన్ని లంకెలు

Thursday, February 08, 2007

శ్రీ నందమూరి ప్రసంగం by శ్రీ క్రిష్ణదేవరాయలు

తెలుగు రక్తాని ఉడికించి, తెలుగు తేజాన్ని మనందరిలో నింపి, భారతదేశంలోనే తెలుగు జాతికి, తెలుగు వాడికి ఒక గుర్తింపును తెచ్చి పెట్టిన మహా మనిషి మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారి ఆ మహా ప్రసంగాన్ని ఈ ఆధునిక ప్రపంచం మరువకుండా ఈ వెబ్ ప్రపంచంలో సాశ్వతంగా వుంచేసారు ఈనాటి శ్రీ క్రిష్ణదేవరాయలు వారు (Dr ఇస్మాయిల్ గారు). ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించి ఆ ప్రసంగాన్ని చదవండి, చదివించండి.

Dr ఇస్మాయిల్ గారి బ్లాగులో ఇంకా ఎన్ని నిగూడమైన ఆణిముత్యాలున్నయో!! నా సంగ్రహాలయం వీటితో కలకలలాడి పోతోందొచ్.
శ్రీ నందమూరి ప్రసంగం-మొదటి భాగము
శ్రీ నందమూరి ప్రసంగం- రెండవ భాగము


కొన్ని మచ్చు తునకలు ...

---సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతీ దీపికలు వెలిగించి మాతృభూమికి ఖ్యాతి ఆర్జించుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు ఆరుకోట్ల తెలుగు ప్రజల పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, నా పక్షాన యివే నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్సుమాంజలులు.

----'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలతో సెలవిచ్చాడు సాక్షాత్తూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఏనాడో. ఆ రసమయ స్వాప్నిక ప్రసాదంగా అవతరించింది అపూర్వ రసబంధుర మహాంధ్రకావ్యం అముక్తమాల్యద.

----సంప్రదాయానికి, ఆధునికతకు మేలి కలయికగా, సుసంపన్నమైన సాంస్కృతిక విలువలకు, అభ్యుదయకరమైన దృక్పథాలకు చక్కని సమ్మేళనంగా అవతరిస్తోంది నేడు ఆంధ్రప్రదేశ్.

----అరుగో! పసుపు కుంకుమలతో పచ్చగా నిండుగా వున్న మన ఆడపడుచులు సుమధుర మందహాసాలతో, మంగళారతులతో స్వాగతం చెబుతున్నారు

ఇదే ఇదే నేను ఆకాంక్షించే తెలుగుసీమ

ఇదే నేను మీనుండి కోరే సహకారం

ఇదే నా వాంఛితం

ఇదే ఇదే ఇదే నా ధ్యేయం.

లోకసమస్తా సుఖినోభవంతు!

జై తెలుగునాడు - జై హింద్!

- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీ.శే. శ్రీ ఎన్.టి.రామారావు. మే, 1984.-

Sunday, January 21, 2007

'కర్నూలు వైద్య కళాశాల' స్వర్ణోత్సవాలు


'కర్నూలు వైద్య కళాశాల స్వర్ణోత్సవాలు'- శ్రీ క్రిష్ణదేవరాయలు

మా 'కర్నూలు వైద్య కళాశాల' స్వర్ణోత్సవాలు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో మీతో ఆ సంతోషాన్ని పంచుకొనేందుకు శ్రీ క్రిష్ణదేవరాయలు @ Dr Ismail గారు రాసిన వ్యాసము నుంచి కొన్ని మచ్చు తునకలు -
" ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం 'కందెనవోలు'. 11వ శతాబ్దిలో 'ఆలంపూరు' లో ఆలయం కట్టడానికి బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో ఈ ప్రాంతంలో బండి చక్రాలకు 'కందెన' రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి 'కందెనవోలు' అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది."
"1565లో తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు"
"తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఇప్పటి రాయలసీమ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు, ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు."
"1953లో మద్రాసు రాష్ట్రంలోని ఉత్తర 11 జిల్లాలన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 'కర్నూలు' కొత్త రాష్ట్రానికి తొలి రాజధాని అయ్యింది."

Wednesday, January 10, 2007

తెలుగుదనాలు (Telugudanaalu)

ఈ వ్యాసము చాలా బాగుంది. రక రకాల తెలుగుదనాలతో తన అనుభవాలను కట్టా గోపాలకృష్ణ మూర్తి గారు ఎంత చక్కగా రాసారో చదవాలేగాని చెప్పతరము కాదు.

ఆన్ లైన్ లో చూడడము పని చేయక పొతే download చేసి ఓపెన్ చెస్తే పనిచేస్తుంది.
Download: తెలుగుదనాలు

కట్టా గోపాలకృష్ణ మూర్తి గారి ఇల్లు http://www-personal.umich.edu/~murty/